బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:13 IST)

కరోనా.. పది నెలలు మూతపడిన షాపు.. తెరిస్తే బాక్సులో అస్థిపంజరం

Skeleton
కరోనాతో పది నెలల పాటు వాణిజ్య సముదాయాలు తొలినాళ్లలో మూసివేశారు. తర్వాత దాదాపు అన్నింటినీ తెరిచారు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఓ షాపు మాత్రం ఓపెన్ చేయలేదు. అలా అని రెంట్ కూడా కట్టడం లేదు. దీంతో యాజమానులు అయినా ప్రార్థనా మందిరం నిర్వహకులు ధైర్యం చేసి ఓపెన్ చేశారు. అయితే అందులో ఓ బాక్స్ కనిపించింది. అందులో చూస్తే పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపును అద్దెకు ఇచ్చారు. లాక్ డౌన్ కన్నా ముందే వ్యాపారం సజావుగా సాగేది. కానీ తర్వాత మూసివేశారు. పది నెలల పాటు మూసివుంచిన ఆ షాపును ఓపెన్ చేయగా.. అందరూ షాక్ తిన్నారు. ఆ షాపులోని ఓ బాక్సులో అస్థిపంజరం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. 
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపు నిర్వహకులను ప్రశ్నించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ అస్థిపంజరం ఎవరిదో తెలియదని.. విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.