సంబంధిత వార్తలు
- కైకాలకు అవయవాలు సహకరించడంలేదు: డాక్టర్లు బులిటెన్ విడుదల
- అల్లుడి ప్రేమలో పడిన అత్తమ్మ.. సోషల్ మీడియాలో వధువు పోస్ట్
- పది రోజులుగా కనిపించని ఛైర్మన్... ప్రైమ్ 9 ఉద్యోగుల ఆందోళన!
- మొసలిని కౌగిలించుకున్న మహిళ... అది రెచ్చిపోతే పరిస్థితి ఏంటి?
- పుష్ప లో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా - అంటోన్న అల్లు అర్జున్
దేశంలో స్పల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు .. 313 మంది మృతి
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో ఈ కేసుల వివరాలతో కూడిన మీడియా బులిటెన్ను విడుదల చేసింది.
ఆ ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 10488 పాజిటివ్ కరోనా కేసులు నమోదుకాగా, 313 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఈ వైరస్ బారినపడి కోలుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 12329 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. దేశంలో ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గత యేడాది మార్చి నెల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అదేసమయంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అంటే 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,714గా వుంది. అలాగే, శనివారం దేశ వ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
