1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (13:28 IST)

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు కరోనా పాజిటివ్ - లక్ష దాటిన కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ 50 వేల మందికి పైగా మహారాష్ట్ర వాసులు ఈ వైరస్ బారినపడుతున్నారు. వీరిలో సినీ సెలెబ్రిటీలు, వీఐపీలు కూడా ఉన్నారు. తాజాగా మరో ఇద్ద‌రు క‌రోనా బారిన ప‌డ్డారు. న‌టుడు విక్కీ కౌశ‌ల్‌, న‌టి భూమి ప‌డ్నేక‌ర్‌ల‌కు క‌రోనా సోకింది. 
 
ఈ విష‌యాన్ని వాళ్లే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా త‌న‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింద‌ని, డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్న‌ట్లు విక్కీ కౌశ‌ల్ త‌న ఇన్‌స్టాలో చెప్పాడు. త‌నో స‌న్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాల‌ని కోరాడు.
 
అటు భూమి కూడా ఇన్‌స్టా ద్వారానే త‌న‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విష‌యాన్ని చెప్పింది. ఇప్ప‌టికైతే త‌నెకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపింది. ఆవిరి ప‌ట్టుకుంటూ, విట‌మిన్‌-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్‌లో ఉంటూ క‌రోనాను ఎదుర్కొంటాన‌ని భూమి చెప్పింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని సూచించింది.
 
ఇదిలావుంటే, దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారి క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న‌ దేశంలో గ‌రిష్ఠంగా 97,894 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గ‌త 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది.
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 52,847 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,65,101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. 7,41,830  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు.