సంబంధిత వార్తలు
- వ్యాక్సిన్ తయారీ కోసం రూ.100 కోట్లు ఇవ్వండి : సీరమ్ వినతి
- దేశంలో కొత్తగా 62 వేల పాజివిట్ కేసులు .. తెలంగాణాలో ఎన్ని?
- మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకోండి : తెలంగాణ సర్కారు ఆదేశాలు
- కరోనాకు మరో టీకా.. ఒక్క డోస్ చాలు :: 6 రాష్ట్రాల్లోనే ఆందోళన!
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా? ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
తెరాస ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా వైరస్ : మద్యం షాపులు బంద్
తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా వైరస్ సోకింది. పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు.
కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు . వాణీదేవి ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈవిషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారు ఐసోలేషన్లో ఉండాలని , కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
మరోవైపు, ఈ నెల 29,30 తేదీలు హోళీ కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు మద్యం షాపులు తెరిచి ఉండడం లేదు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసేస్తున్నారు.
