సంబంధిత వార్తలు
- కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన తండ్రిని సజీవదహనం చేసిన ఫ్యామిలీ..
- పుత్రికోత్సాహంలో తండ్రులు, లోక్సభ స్పీకర్ కుమార్తె ఐఏఎస్, పోలీసు కుమార్తె ఐపీఎస్
- ఇంటికి వచ్చేస్తున్నా.. సగర్వంగా ఇంటికి బయలుదేరనున్న పాండ్యా.. ఎందుకు?
- తండ్రి ఫోనులో ఇతర మహిళల ఫోటోలు, అభ్యంతరకర రీతిలో చూసి కుమార్తె షాక్
- దుబాయ్లో అనంతపురం మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారం, చెబితే?
పాండ్యా సోదరులకు పితృవియోగం.. గుండెపోటుతో హిమాన్షు పాండ్యా మృతి
Hardik Pandya
పాండ్యా సోదరులను క్రికెటర్లుగా చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. పాండ్యా సోదరుల తండ్రి కూడా కొడుకులను క్రికెటర్లుగా చేయడానికి చాలానే కష్టపడ్డారు. సూరత్ లో కార్ ఫైనాన్స్ వ్యాపారం చేసే హిమాన్షు.. తన కుమారుల కెరీర్ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి వడోదరకు మార్చారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇద్దరినీ చేర్పించి శిక్షణ ఇప్పించారు.
హిమాన్షు మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయనతో రెండుమూడు సార్లు మాట్లాడానని, ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నాడు కోహ్లీ. జీవితంలో అన్నీ సాధించిన భావన ఆయనలో కనిపించేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
