సంబంధిత వార్తలు
- ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!
- మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!
- టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం
- యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?
- బాలానగర్లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
బెయిలుపై విడుదలై 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం...
జైలు నుంచి బైయిలుపై విడుదలైన ఓ వ్యక్తి 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గంటూరు జిల్లా పెదనందిపాటు గ్రామంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అత్యాచారం కేసుల్లో జైలుకు వెళ్లిన ఓ కామోన్మాది. మూడు రోజుల క్రితం బెయిలుపై విడుదలై మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈసారి ఏకంగా 64 ఏళ్ల వృద్ధురాలిని కాటేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాక ఆమెను దారుణంగా హత్య చేశాడు.
గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించినప్పటికీ, ఆ వృద్ధురాలు ఓ ఉన్నది ఈ ఘాతుకానికి బలైపోయినట్లు గుర్తించారు. నిందితుడు మంజు 2023లో ఇదే తరహా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత 2024లో కూడా ఓ మహిళపై అత్యాచారానికి ఒడి గట్టాడు. ప్రస్తుతం ఆ కేసులో జైలులో ఉన్న అతడు మూడు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యాడు. వృద్ధురాలు స్థానికంగా స్వీపర్గా పనిచేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం రాత్రి వృద్ధురాలిపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడు వెంటనే పరారయ్యాడు.
ఆదివారం ఉదయం పనికి రాకపోవడంతో, అదే గ్రామంలో ఉంటున్న ఆమె కుమార్తె గుడిసె వద్దకు వచ్చి చూడగా... వృద్ధురాలు రక్తం మరకలతో పాటు ఒంటిపై గాట్లతో కనిపించింది. దీంతో ఆమె పోలీ సులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి సాంబ, మంజు అనే వ్యక్తులు అనుమానంగా తిరగడం గమనించినట్లు స్థానికులు తెలపడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి మంజు రేప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
