సంబంధిత వార్తలు
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నేత మృతి
- కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి
- Good Samaritan Scheme: రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్చితే.. రూ.25వేలు ఇస్తారు.. తెలుసా?
- మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స
- పొరుగింటి మగాడితో పడక సుఖానికి బానిసైన భార్య.. అడ్డొస్తున్న భర్తను చంపేసింది..
బాలానగర్లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం
హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో పెను విషాదం చోటుచేసుకుంది. బాలానగర్లోని ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడుని బాలానగర్ జలగం సాయి సత్య శ్రీనివాస్గా గుర్తించారు. ఇంటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఆయన అక్కడే కాలిపోయాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతుంది.
పటాన్చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
