సంబంధిత వార్తలు
- యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..
- కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య
- Cab Driver: క్యాబ్ డ్రైవర్తో మహిళ పరిచయం-రూమ్ బుక్ చేయమని.. ఇంకొడితో జంప్!
- love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?
- ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం
ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు
ఐటీ నగరం బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రియురాలిన ఓ హోటల్ గదికి తీసుకెళ్లి ప్రియుడు చంపేశాడు. ప్రియురాలి శరీరంపై కత్తితో 17 సార్లు పొడిచిన గాట్లు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమై వుంటాయని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మృతురాలిని ఇద్దరు పిల్లల తల్లి హరిణి (33)గా గుర్తించారు. ఆమె కెంగేరిలోనే నివాసముంటున్న తన ప్రియుడు టెక్కీ అయిన యశస్ (25)తో కలిసి హత్య జరగడానికి రెండు రోజుల ముందు ఓయో హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యశస్.. హరిణిపై కత్తితో దాడి చేశాడు. ఏకంగా 17 సార్లు పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హరిణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వ్యక్తిగత కారణాలు వారి మధ్య ఉన్న సంబంధంలోని సమస్యలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలపై లోతుగా విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.
