1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 మే 2025 (13:00 IST)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

suicide
తన భార్యకు గతంలోనే వివాహమైందన్న విషయాన్ని తెలుసుకున్న ఓ భర్త బలవన్మరణానికి పాల్డ్డాడు. తనకు పెళ్లయిందన్న విషయాన్ని భార్య కొన్ని సంవత్సరాల పాటు దాచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నిజం తెలుసుకున్న భర్త... భార్య చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగుళూరు పరిధిలోని నగరభావి అనే ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరభావి, చంద్ర లే ఔట్‌ 2 స్టేజ్‌కు చెందిన వినయ్ పి (41) అనే వ్యక్తి సివిల్ కాంట్రాక్టరుగా పని చేస్తున్నాడు. ఈయనకు మ్యాట్రిమోనియల్ ద్వారా సంధ్య మహిళతో గత 2017లో వివాహం చేసుకోగా, గత 2018లో కమార్తె జన్మించింది. ఈ వివాహాన్ని కూడా ఎంతో గ్రాండ్‌‌గా ఐదు నక్షత్ర హోటల్లో నిర్వహించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యకు గతంలోనే వివాహమైనట్టు వినయ్ తెలుసుకుని కుమిలిపోయాడు. 
 
తన వైవాహిక జీవితంలో ఎదురైన తీవ్ర ఒత్తిడిని అధిగమించేందుకు మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత వైవాహిక బంధాన్ని చక్కదిద్దుకునేందుకు వినయ్ ప్రయత్నించినప్పటికీ భార్య ఏమాత్రం సహకరించలేదు. ఆమె మోడలింగ్, యాక్టింగ్ కెరీర్‌లో స్థిరపడేందుకు విడాకులు కావాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. వీటిని భరించలేని వినయ్.. హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వినయ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.