సంబంధిత వార్తలు
- ముంబై హాస్టల్లో 200 మందికి కరోనా.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
- మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. 229 మంది హాస్టల్ విద్యార్థులకు పాజివిట్
- కుమార్తెను ప్రేమించాడని మర్మాంగాన్ని చాకుతో కోసేసారు: ఢిల్లీలో 'ఉప్పెన' విలన్స్
- ఒక ప్లాటు రెండు రిజిస్ట్రేషన్లు.. 25 కోట్లు హాంఫట్.. ఎక్కడ..?
- కూతురు మెడలో తాళి తెంచి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ....
మైనర్ బాలికపై వేద పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని వాషీమ్లో జరిగింది. వేద పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఈ పాడుపనికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని శ్రీ నరసింగ్ సరస్వతి స్వామి మహారాజ్ వేదపాఠశాలలో 12 యేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలికను తన ఇంటికి పిలిచిన ఉపాధ్యాయుడు.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని.. కాస్త నొక్కాలని చెప్పాడు. దీంతో ఆ బాలిక కాళ్లు నొక్కడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దీంతో బోరున విలపిస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
