మంగళవారం, 15 జులై 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 జులై 2025 (22:30 IST)

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్‌కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం
 
తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
 
గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.
 
మెంతులు నానబెట్టిన నీరు తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
 
కీరదోస రసం శరీరాన్ని చల్లబరుస్తుంది, నిర్జలీకరణాన్ని నివారిస్తుంది
 
ఐతే ఉదయాన్నే పరగడుపున తాగకుండా నివారించాల్సినవి, కాఫీ మరియు ప్యాక్ చేసిన జ్యూస్‌లు
 
గమనిక: ఈ సమాచారాన్ని అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.