శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 మే 2020 (20:34 IST)

కరోనా వైరస్, రోగనిరోధక శక్తిని అడ్డుకునే కషాయం

ఏదైనా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి, బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వల్ల బాధపడుతోంది. ప్రతిచోటా ఈ వైరస్‌ను ఎలా వదిలించుకోవాలోనన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అదే సమయంలో, ఈ వైరస్‌ను ఎదుర్కోవటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి కషాయాలను ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా ఈ కషాయంతో తగ్గించుకోవచ్చు.
 
ఈ కషాయం కోసం రావిచెట్టు ఆకులు, శొంఠి పొడి, నల్ల మిరియాలు, తులసి ఆకులు మరియు 1 లీటరు నీరు సరిపోతుంది. రావిచెట్టు ఆకులు, శొంఠి మరియు నల్ల మిరియాలు కలిపి 1 లీటరు నీటిలో 3-4 తులసి ఆకులతో చూర్ణం చేయాలి. దీనిని ఓ పాత్రలో వేసి వేడి చేస్తూ ఆ నీరు సగం దాకా మిగిలి వుండేవరకూ మరగించాలి. అలా తయారుచేసుకున్న కషాయాన్ని రోజుకు 1-1 కప్పు గోరువెచ్చగా మూడుసార్లు తాగవచ్చు.
 
రావిచెట్టు బెరడు, ఆకులు అన్నీ ఆయుర్వేదంలో చాలా కాలం నుండి ఉపయోగించబడుతున్నాయి. ఇవి మన శరీరం లోపల సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధిస్తాయి. నల్ల మిరియాలు ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము. ఈ నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది గొంతు నొప్పి, గొంతు మరియు టాన్సిల్స్ వంటి సమస్యల నుండి బయటపడటానికి నల్ల మిరియాలు ఉపయోగిస్తారు. కనుక పైన చెప్పుకున్న నాలుగుంటిని కలిపి కషాయంగా చేసుకుని తాగితే ఈ కరోనా వైరస్ వేళ ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.