శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (14:08 IST)

JIO: రూ.47 కే జియో బంపర్ ఆఫర్.. అతి తక్కువ EMIతో..?

రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం సంచలన ఆఫర్లతో ముందుకొస్తుంది. తాజాగా జియో మరో బంపర్ ఆఫర్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఒకే ఇంటిలో ఉండే వారు ఇంటర్నేట్ వేరువేరుగా కాకుండా కనెక్టివిటీ కోసం WiFiనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క జీయో ఫై 4జీ హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు. ఇక ఈ ఆఫర్ కేవలం 47 రూపాయలకే లభిస్తుంది. అంటే, అతితక్కువ EMIతో కొనుగోలు చెయ్యవచ్చు.. ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI ఆఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు.
 
ఇక ఇలాంటి మరొక JioFi అఫర్ విషయానికి వస్తే.. జీయో ఫై రూటర్ M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router ఎం2 బ్లాక్ సేల్ ధర 1,999 రూపాయలు ఉండగా.. EMI తో కొనేవారికి కేవలం నెలకు 94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.

అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా జియో అధికారిక వెబ్సైట్ లాగ్ ఇన్ అయి కొనుగోలు చేయవచ్చు.