1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Jio Platforms Surges into Global Top 20 in latest WIPO Patents Ranking

WIPO తాజా పేటెంట్ల ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20లోకి దూసుకెళ్లిన జియో ప్లాట్‌ఫార్మ్స్

Jio
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫార్మ్స్(JPL), ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(WIPO) ఇటీవల విడుదల చేసిన తాజా పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20లోకి ప్రవేశించింది. ప్రచురిత డేటా ఆధారంగా అగ్ర PCT దరఖాస్తుదారులను ఈ నివేదిక ర్యాంక్ చేస్తుంది.  
 
2025 సంవత్సరానికి సంబంధించిన జాబితాలో JPL ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో హువావే, శాంసంగ్, క్వాల్కమ్, ఎల్‌జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల సరసన స్థానం సంపాదించింది.  
 
జియో పేటెంట్ పోర్ట్‌ఫోలియో ప్రధానంగా 5G, 5G అడ్వాన్స్‌డ్, 6G, కృత్రిమ మేధస్సు (AI), AI-నేటివ్ నెట్‌వర్క్స్, క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, రేడియో యాక్సెస్, కోర్ నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్, నెట్‌వర్క్ స్లైసింగ్ మరియు డిజిటల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి తదుపరి తరం డిజిటల్ సాంకేతికతలపై దృష్టి సారించింది.  
 
ఈ విజయంపై జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆకాష్ ఎం. అంబానీ మాట్లాడుతూ: WIPO PCT ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ ప్రపంచ టాప్-20లోకి ఎదగడం, ఒక డీప్-టెక్ కంపెనీగా మారేందుకు మేము ఎన్నో సంవత్సరాలుగా చేసిన కృషికి ప్రతిబింబం. ఇది పలు అధునాతన సాంకేతిక రంగాల్లో జియోలో జరుగుతున్న వేగవంతమైన ఆవిష్కరణలకు నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రగతి మరింత వేగం అందుకుంటుంది. ప్రపంచానికి సాంకేతికతను సృష్టించే, స్వంతం చేసుకునే మరియు ఎగుమతి చేసే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. ప్రపంచ డీప్-టెక్ శక్తిగా భారత్ ఎదిగే ప్రయాణంలో మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము.  
 
ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 1% కంటే తక్కువగా పెరిగిన ఏడాదిలోనే జియో 320 స్థానాలు ఎగబాకి 20వ స్థానాన్ని సాధించడం విశేషం. WIPO ర్యాంకింగ్, జియో ప్లాట్‌ఫార్మ్స్ పరిశోధన, అభివృద్ధి (R&D) సామర్థ్యానికి, అలాగే మేధోసంపత్తి బలానికి లభించిన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ గుర్తింపు. ఇది పలు అధునాతన సాంకేతిక రంగాల్లో భారతీయ మూలాలున్న ఆవిష్కరణలను ప్రపంచ టెక్నాలజీ సృష్టి వేదికపై బలంగా నిలబెడుతోంది.  
 
మార్చి 31, 2026 నాటికి జియో ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేసింది. వీటిలో 2,393 పేటెంట్లు భారత్‌లో, 4,424 పేటెంట్లు విదేశీ దేశాల్లో దాఖలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు మంజూరయ్యాయి, వీటిలో భారత్‌లో 538, అంతర్జాతీయ మార్కెట్లలో 471 పేటెంట్లు ఉన్నాయి. జియో ఎల్లప్పుడూ తాను అభివృద్ధి చేసి, భారీ స్థాయిలో వాణిజ్యీకరించిన సాంకేతికతలు, ప్లాట్‌ఫార్మ్‌ల ఆధారంగానే ఆవిష్కరణలను కొనసాగిస్తోంది. భవిష్యత్తు డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్వచించే సాంకేతికతలైన 5G/6G రేడియో, 5G/6G కోర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ మరియు ఏజెంటిక్ AI రంగంలోని JioBrain వంటి పరిజ్ఞానాలను కూడా అభివృద్ధి చేస్తోంది.  
 
ప్రపంచ స్థాయి టెక్ ఐపీ లీడర్‌గా జియో ఎదగడం, భారీ స్థాయిలో సాంకేతికతలను అమలు చేసే దేశం నుంచి, స్వంత సాంకేతికతలను సృష్టించే దేశంగా భారత్ మారుతున్న దిశను సూచిస్తోంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)