గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (19:40 IST)

భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే నోకియా 110 4జీ

nokia
భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ ని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
 
యల్లో ఆక్వా, బ్లాక్ కలర్‌లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
 
క్లాసిక్‌, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్‌, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ఫోన్‌ను సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందని సింగ్ చెప్పారు.