సంబంధిత వార్తలు
- బెంగళూరులో రాహుల్ గాంధీ సర్ప్రైజ్లు... కన్ఫ్యూజన్లో రాజ్ కుమార్ అభిమానులు
- ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు సమస్య ఏంటో విశాల్కు తెలుసా? ఏడుస్తూ ట్వీట్ పెట్టాడు
- నాకు సినిమాల్లో అవకాశాలు లేవని ఎవరు చెప్పారు... శివమెత్తిన శివాజీ..!
- సినీ నటుడు బాలాజీపై కిడ్నీ మోసం కేసు.. సీన్లోకి వచ్చిన శ్రీరెడ్డి
- మోదీని వ్యతిరేకిస్తున్నానని బాలీవుడ్ తొక్కేస్తోంది... చంద్రబాబు నిస్సహాయం: ప్రకాష్ రాజ్
జగన్ మోహన్ రెడ్డిపై నటుడు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు?
రాజకీయాలు నాకు కొత్తేమీ కాదు. ఎంతోమంది అనుభవం ఉన్న రాజకీయ నేతలతో కలిసి పనిచేశాను. ప్రజా సేవ చేయడం నాకెంతో ఇష్టం. సినిమాల్లో నటిస్తూనే ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను. అందుకే బిజెపిలో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ప్రధాని చేసిన అభివృద్థి కార
రాజకీయాలు నాకు కొత్తేమీ కాదు. ఎంతోమంది అనుభవం ఉన్న రాజకీయ నేతలతో కలిసి పనిచేశాను. ప్రజా సేవ చేయడం నాకెంతో ఇష్టం. సినిమాల్లో నటిస్తూనే ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను. అందుకే బిజెపిలో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ప్రధాని చేసిన అభివృద్థి కార్యక్రమాలే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎక్కువమంది ఉన్న మాట వాస్తవమే. అది నాకు తెలుసు. ఇప్పుడు ఎపిలో ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతోంది. అయితే కేంద్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
హోదా గురించి నేను మాట్లాడను. బిజెపి అధినాయకత్వం చూసుకుంటుంది. కానీ కొంతమంది నేతలు ఆవేశపూరితంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా సీనియర్ నేతలను విమర్శిస్తున్నారు. ఇది తప్పు. అందులో జగన్మోహన్ రెడ్డి మొదటి వ్యక్తి. జగన్ ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు. రాజకీయంలో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అది ముందు తెలుసుకోవాలి. మనపైన ఆరోపణలు వస్తే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ జగన్ అది చేయడం లేదు.
తనపై పడిన బురదను తుడుచుకోవాలే గానీ... ఇంకా బూడిదను పూసుకోకూడదు. జగన్కు ఆ విషయం తెలియడం లేదు. జగన్ గారు.. తెలుసుకోండి.. రాజకీయాలు నేర్చుకోండి అంటూ సాయికుమార్ జగన్ పైన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, కానీ కొన్ని మార్పులు ఆయనలో రావాలంటున్నారు సాయికుమార్. సాయికుమార్ ఒకవైపు జగన్ను తిడుతూ మరోవైపు పొగుడుతూ ఉండటంతో వైసిపి కార్యకర్తలకు అసలేమీ అర్థం కావడం లేదు. సాయికుమార్ తిడుతున్నారా.. పొగుడుతున్నారా తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తంమీద సాయికుమార్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.
