1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:00 IST)

2022-23 బడ్జెట్ హైలైట్స్ - 2022 చివరి నాటికి 5జి స్ప్రెక్టమ్‌ వేలం

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పేపర్ లేస్ విధానంలో ఈ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగో ఏడాది ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 
 
2022-23 బడ్జెట్ హైలైట్స్ 
 
* 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
* 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
*  రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
*  ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు
 
* ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
* రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు
* రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం
* డిఫెన్స్‌ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్‌ రీసెర్చ్‌ కోసం కేటాయింపులు
* పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
* ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
* సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
* 10 రంగాల్లో క్లీన్‌ ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌
 
* ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
* వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
* పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలు
* ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
* నిధుల సమీకరణకు సావర్‌ గ్రీన్‌ బాండ్లు
 
* త్వరలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
* 2022-23లోనే అమల్లోకి డిజిటల్‌ కరెన్సీ
* డిజిటల్‌ కరెన్సీ కోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ
* ఎలక్ట్రికల్‌ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
* త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
 
* ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు
* పెట్రో డీజిల్‌ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
* దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
 
* చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ పథకం అమలు
*2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు
* 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌
* 75 జిల్లాల్లో 75 ఈ-బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌)
 
* అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
* ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు
*  పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు
* ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం
 
* అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం
* పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఏర్పాటు
* వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లు
 
* దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ నిర్మాణం
* 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
* మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
* డిజిటల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం
 
* వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు
* పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
* రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు
* ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే
* అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం
 
* త్వరలో 5జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5జి స్ప్రెక్టమ్‌ వేలం
* 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి
* పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబులింగ్‌
* ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు
 
*  రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
*  రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
* రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
* ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా.