సంబంధిత వార్తలు
- 3 కోట్ల ఐఆర్సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ
- మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం
- వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?
- ప్రయాణికుల భద్రతకు పెద్దపీట - రైలు బోగీల్లో నిఘా నేత్రాలు
- వేవ్స్ సమ్మిట్లో 9 ప్రాజెక్ట్ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ
వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ళు పగటి పూట మాత్రమే పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్లనున్నాయి. ఈ రైళ్ల భద్రత తనిఖీల్లో భాగంగా వివిధ రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజాగా వందే భారత్ స్లీపర్ రైలులో వాటర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ఇది విజయవంతంగా పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. కోటా-నగ్డా సెక్షన్ మధ్య జరిగిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించింది.
ఈ సందర్భంగా రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు అధికారులు వినూత్నంగా వాటర్ టెస్ట్ నిర్వహించారు. రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నా, లోపల టేబుల్ మీద పిరమిడ్ ఆకారంలో ఒకదానిపై ఒకటి పేర్చిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు.
వీడియోలో మొబైల్ స్పీడోమీటరుపై 182 కిలోమీటర్ల వేగం కనిపిస్తున్నప్పటికీ, రైలు ఏమాత్రం కుదుపులకు లోనుకాకుండా సాఫీగా ప్రయాణించిందని, ఇది ఈ కొత్తతరం రైలు సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ఈ పరీక్షలు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
