శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (11:56 IST)

తవ్వా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. చేపల్లోని విటమిన్ డి నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. వారానికే రెండుసార్లు చేపలలో ఆహారంలో భాగంగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. దాంతో మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇటువంటి చేపలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
చేపలు - 500 గ్రాములు
కోడిగుడ్డు - 2 
మెుక్కజొన్న పిండి - 100 గ్రాములు
కారం - తగినంత
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
మిరియాల పొడి - 1 స్పూన్
ఓమా - 1 స్పూన్
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - 1 కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
చాట్ మసాలా - 1 స్పూన్
నిమ్మరసం - 3 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా చేపలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఆ తరువాత పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చేప ముక్కలు వేసి అందులో మెుక్కజొన్న పిండి, కారం, ధనియాలపొడి, జీలకర్ర, మిరియాల పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఓమా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేపలపై కోటింగ్‌లా వేసి అరగంట పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు తవ్వా మీద కొద్దిగా నూనేపోసి చేపముక్కలను వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర, చాట్ మసాలా చల్లాలి. అంతే టేస్టీ టేస్టీ తవ్వా ఫిష్ ఫ్రై రెడీ.