1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (13:50 IST)

కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?

కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువుల వద్ద దీపాలను వెలిగించడం ద్వారా రుణ విముక్తులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువులు మొదలైన ప్రదేశాలలో దీపాలను వెలిగించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తీరుతాయి. దీనితో పాటు కార్తీక పూర్ణిమ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం తప్పనిసరిగా కట్టాలి. ప్రధాన ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి.
 
అలాగే కార్తీక మాసంలో తులసిని పూజిస్తే శాశ్వత ఫలం లభిస్తుంది. ఈ రోజున తీర్థపూజ, గంగాపూజ, విష్ణుపూజ, లక్ష్మీపూజ, యాగాలు నిర్వహిస్తారు. ఈ రోజున తులసి మాతను పూజించి, ఆమె ముందు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
కార్తీక పూర్ణిమ రోజున ఉపవాసంతో పాటు గంగాస్నానానికి కూడా విశేష విశిష్టత ఉంది. అలాగే కార్తీక పూర్ణిమ నుండి ఒక సంవత్సరం పాటు పౌర్ణమి వ్రతం తీర్మానం చేసి ప్రతి పౌర్ణమి నాడు స్నానం చేయడం వంటి పుణ్యకార్యాలతోపాటు శ్రీ సత్యనారాయణ కథా శ్రవణం ఆచారం ఫలవంతమైనదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.