సంబంధిత వార్తలు
- మార్చి 17న చిలకలూరిపేటలో బహిరంగ సభ.. ఒకే వేదికపై ఆ ముగ్గురు
- రెండుచోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని, కూటమి కోసం ఎంతో శ్రమించా: పవన్ కల్యాణ్
- సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం : పవన్ కళ్యాణ్
- హైదరాబాదుకు అమిత్ షా.. టార్గెట్ ఏంటంటే?
- దిగివచ్చిన ఏపీఎస్ఆర్టీసీ : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి సభకు బస్సులు ఇచ్చేందుకు సిద్ధం...
జోగులాంబను దర్శించుకున్న డీకే అరుణ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయం అనే 5వ శక్తి పీఠాన్ని భారతీయ జమాతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ, నాగర్కర్నూల్ పోటీదారు పి భరత్ ప్రసాద్తో కలిసి బుధవారం సందర్శించారు.
మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ రెండు నియోజకవర్గాల్లోనూ భాజపా విజయం సాధించాలని డీకే అరుణ అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు డికె అరుణతో పాటు బీజేపీ నేతలకు ఘనస్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా డీకే అరుణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులందరికీ అఖండ విజయాన్ని అందించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని అమ్మవారిని ప్రార్థించారు.
