1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:20 IST)

ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది. 
 
అయితే ఆటో ఎక్కిన మహిళ కొద్దిగా దూరం వెళ్ళాక ఆటో డ్రైవర్ ఆమెపై బలాత్కారం చేయబోయాడు. దీంతో భయాందోళనకు గురైన తప్పించుకుని శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.