సంబంధిత వార్తలు
- ట్విట్టర్ ట్రెండింగ్- భారత్ మ్యాట్రిమోనీని బాయ్కాట్ చేయండి..
- పాట విజయం నాకెంతో సంతోషాన్నిచ్చింది, ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుంది : సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్
- మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ఇనుప రాడ్తో కొట్టి చంపేసింది
- మలయాళ నటి అనికాపై మాజీ ప్రియుడు దాడి: ఫోటోలు షేర్ చేసిన నటి
- ముంబైలో బాలుడు అపహరణ - జగ్గయ్యపేటలో గుర్తింపు!
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయి బాలుడు మృతి
గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయి పసిపిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంపెద్ద కొర్పోలు గ్రామ శివారు వెంకట్తండాలో ధారావత్ మాలు, కవిత దంపతులకు మణికంఠ అనే ఏడాది బాబు వున్నాడు.
అయ్యప్పమాల వేసుకున్న ధారవత్ మాలు.. పూజ కోసం గుడికి వెళ్లాడు. కవిత ఇంటి పనిలో వుండగా మణికంఠ కొబ్బరి ముక్క తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోయి శ్వాస ఆడలేదు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.