తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని కేద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నారన ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంఐఎం, టీఆర్ఎస్ అబద్ధాలు చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ను యూటీగా మార్చే ప్రమాదం ఉందంటూ లోక్సభలో ప్రస్తావించిన మజ్లిస్...