తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా పది మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, పది మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ పరీక్షలు నిర్వహించిన వారిలో హైకోర్టు సిబ్బంది, సెక్యూరిటీ బలగాలు ఉన్నారు. కరోనా ఇన్ఫెక్షన్ను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే...