సంబంధిత వార్తలు
- హైదరాబాద్ను తిరుపతికి అనుసంధానం.. బహిరంగ సభలో ప్రధాని స్పీచ్ (Live Video)
- సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అనుకునే వారికి వారధిగా సినీప్రెన్యూర్ కంపెనీ
- హైదరాబాదులో మోదీ పర్యటన.. నగరంలో ఆంక్షలు ఎక్కడంటే..?
- బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి.. ప్రధాని మోడీ
- 8న హైదరాబాద్ వస్తున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదే..
తెలంగాణలో నెపోటిజం వుంది.. పేరు చెప్పకుండా కేసీఆర్ని ఏకేసిన పీఎమ్
తెలంగాణలో 11,300 కోట్ల విలువైన వందే భారత్ ఎక్స్ప్రెస్తో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారిక కార్యక్రమాలను దాటవేసి, విమానాశ్రయంలో ప్రధానిని స్వాగతించలేదు.
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కొద్ది మంది ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో అవినీతిని, బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.
ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాల కోసం చూస్తున్నారని కేసీఆర్ పేరు చెప్పకుండా మోదీ అన్నారు. తెలంగాణలో మెట్రో ప్రాజెక్టు, రూ.15,000 కోట్లతో 5,000 కి.మీ జాతీయ రహదారి చేరికతో సహా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతి, బంధుప్రీతిపై పోరాడేందుకు తెలంగాణ ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
