శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (20:21 IST)

దిశ హత్య కేసు: నాలుగో నిందితుడిని చెడగొట్టిన మొదటి నిందితుడు

దిశ అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిందితుల పూర్తి వివరాల గురించి వారి కుటుంబం గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నం చేస్తూ వుంది. అంత దారుణంగా నిందితులు ఎలా మారారు, వాళ్ల కుటుంబ నేపధ్యం ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నాలుగో నిందితుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
 
వారి మాటల్లోనే... అతడికి కిడ్నీ సమస్య వుంది. మాకు తెలిసి మా అబ్బాయి కోసం ఇంటి ముందుకు ఎవరు రారు. అంతా ఫోన్ ద్వారానే జరుగుతుంది. ఫోన్ చేసి తీసుకుని వెళతారు. అతడికి కిడ్నీ సమస్య వుండటంతో తింటాడు ఇంట్లోనే వుంటాడు. మేమంతా అతడిని కూలీ పని చేసి పోషిస్తున్నాం.
 
మాకు తెలిసి వాడికి అసుమంటి చేష్టలు లేవు. మొదటి నిందితుడే మావాడిని చెడగొట్టిండు. తాగిన మైకంలో ఏం చేశాడో తెలియదు అని అతడి తల్లి వెల్లడించారు. నిందితుడిని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్న యువతి మాట్లాడుతూ.. అతడికి అసుమంటి చేష్టలు లేవు. ఉంటే నేనెందుకు పెళ్లాడుతా. కిడ్నీ ట్రబుల్ బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పిండ్రు. అంతే, అప్పట్నుంచి అతడిని ఇంట్లోనే వుండమన్నాం. 
 
మొదటి నిందితుడు మధ్యాహ్నం లేపుకుని వెళ్లిండంట. లోడ్ వచ్చింది, పైసలు తీసుకెళ్దువ్ రా అని తీసుకెళ్లిండ్రు అంతే, నా భర్త తప్పు చేసిండు అని నిరూపణ అయితే నలుగురితో పాటు నా భర్తను ఉరి తీయండి. మా బతుకుదెరువు గింతె జూడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.