1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Disha incident, Lorry in CC camera video

లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ

Disha incident
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేసినా సరే ఆ యువతి పడిన బాధ అందరినీ కలచివేస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకులు చెప్పిన మాటలు అలాంటివి. మొదట్లో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత లారీలోను అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
గంటన్నరపాటు అతి దారుణంగా దిశకు నరకం చూపించిన ఆ మృగాళ్ళు ఆ తరువాత లారీలోను అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లారీలో అత్యాచారం జరిగిన సమయంలో పట్ట కప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సి.సి. ఫుటేజ్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. లారీ కదిలినప్పటి నుంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
 
అయితే పట్ట కప్పి ఉండడం.. పూర్తిగా చీకటి కావడంతో ఎవరూ కూడా ఈ మృగాళ్ళ అకృత్యాలను గుర్తించలేకపోయారు. దీంతో దిశ చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో మాత్రం ఈ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఇంత దారుణానికి మృగాళ్ళు పాల్పడటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
About Writer
జె
తర్వాతి కథనం
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో కోటి మొక్కలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్