శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (09:18 IST)

భార్య నల్లగా ఉందనీ.. ఆ కిరాతక భర్త ఏం చేశాడంటే...

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సహజమే. కొన్ని క్షణాల్లో అవన్నీ సర్దుకునిపోతాయి. కానీ, ఇక్కడ ఆ మనస్పర్థలే ఓ వివాహిత దారుణ హత్యకు కారణమయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన యోగి, అరుణ యువతీయువకులు ఆర్నెల్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం భార్య నల్లగా ఉండటమే. ఈ ఒక్క కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితోకాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను యోగి వేధించసాగాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.