1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Infosys techie from Telangana's Suryapet district dies in Sydney

ఆస్ట్రేలియాలో తెలుగు టెక్కీ అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్

Infosys techie
ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలం ఇంజంగారి గూడెంవాసి. ఉద్యోగం కోసం ఆర్నెళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డి.. సిడ్నీలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఈయన ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. 
 
ఆదివారం సాయంత్రం తన భార్య శిరీష‌తో మాట్లాడారు. మరుసటిరోజు భార్య ఫోన్ చేయగా, ఆదినారాయణ రెడ్డి లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియాలోని ఆయన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి, రూంకు వెళ్లి చూడాలని కోరారు. దీంతో ఆదినారాయణ రూంకు వెళ్లి చూడగా, ఆయన విగతజీవిగా పడివున్నారు. ఈ విషయాన్ని అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. 
 
భర్త మరణవార్త వినగానే శిరీష కుప్పకూలిపోయింది. శిరీష - ఆదినారాయణకు మూడేళ్ల కవల పిల్లలున్నారు. ఆదినారాయణ రెడ్డి‌ మృతిపై ఆసీస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తన భర్త మృతి కేసులో అనుమానం ఉందనీ, దీనిపై లోతుగా దర్యాప్తు జరిపించాలని భార్య శిరీష కోరుతోంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వింత పిల్లలకు జన్మనిచ్చిన మేక