గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (19:31 IST)

కిడ్నీ మిస్సింగ్... వైద్యులే కాజేశారంటూ రోగి బంధువులు...

కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరితే చికిత్స పేరుతో వైద్యులు కిడ్నీని కాజేశారంటూ ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తికి కడుపులో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కోసం యూఎస్ఏ నుండి వచ్చి మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ని తీసి శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే కొద్ది గంటల తర్వాత అతని ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. అక్కడ పనిచేసే డాక్టర్ ఉమాశంకర్ చెపుతూ...  శివప్రసాద్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసివేసి ఉందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
ముందురోజే చికిత్స కోసం పది లక్షలు చెల్లించామనీ, ఇంతలో కిడ్నీ ఎలా మాయమైందని డాక్టర్‌లను నిలదీశారు. మీరే కీడ్నీని దొంగిలించారని వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.