1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. KTR directs officials to identifies old buildings in Hyderabad

హైదరాబాద్ నగరంలోని శిథిల భవాలను తక్షణమే ఖాళీ చేయించాలి.. కేటీఆర్

Hyderabad
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోతోంది. నగరంలోని నాళాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైవున్నాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. 
 
ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సివిల్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంటే... మరోగదిలో బాలికపై లైంగిక దాడి.. ఎక్కడ?