శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (17:10 IST)

భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాదు నగరంలో ప్రతిరోజు సుమారు 2 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో దక్షణ భారతంలోనే తెలంగాణ బెస్ట్‌గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును ఈ రోజు కేటీఆర్ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ లోని ఫతుల్‌గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు.
 
నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ప్రీ నెంబరు 1800120072659కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.