1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 29 మే 2021 (14:02 IST)

Oxygen తరలిస్తున్న గూడ్సులో మంటలు

పెద్దపల్లి: ఆక్సిజన్‌ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్‌ రైలులో మంటలు చెలరేగడం పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ట్యాంకర్లతో వెళ్తున్న ఈ రైలులోని ఒక ట్యాంకర్‌లో కూనారం-చీకురాయి మధ్య అకస్మాత్తుగా మంటలు రేగాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినఅక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన బోగీని  మిగతా బోగీల నుంచి విడగొట్టి దూరంగా తరలించారు.

అయితే, ఈ ప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. పైన విద్యుత్‌ తీగలు ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు