సంబంధిత వార్తలు
- 'మనసు మమత' టీవీ సీరియల్ నటి శ్రావణి బలవన్మరణం...
- జోగుతున్న సినీ ఇండస్ట్రీ.. సుశాంత్ మృతితో వెలుగులోకి డ్రగ్స్ దందా
- నవంబర్ 2020లో మార్కెట్లోనికి రానున్న ఎథర్ 450X
- నేషనల్ పోలీస్ అకాడెమీపై కరోనా పంజా : 80 మంది సిబ్బందికి పాజిటివ్
- సుశాంత్కు రవ్వంత హాని చేయలేదు.. డ్రగ్స్ తీసుకోను.. సిగరెట్ కాల్చుతా : రియా చక్రవర్తి
అమీర్పేటలో డ్రగ్స్ కలకలం.. టెక్కీలో లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా!
హైదరాబాద్ నగరంలోని అమీర్పేటలో డ్రగ్స్ కలగలం చెలరేగింది. ముగ్గురు సభ్యుల ముఠాను భాగ్యనగరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరు ఉపయోగించిన 2 కార్లు, బైకులను కూడా సీజ్ చేశారు.
భారతీయ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో అటు బాలీవుడ్లోనూ, ఇటు టాలీవుడ్లోనూ పలువురు సినీ ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఈ పరిస్థితుల్లో అమీర్పేటలో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో నిఘా వేసిన పోలీసులు... ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఈ ముఠా నుంచి 105 గ్రాముల ఎండీఎం, 25 కొకైన్, 250 గ్రాముల గంజాయి, 4 గ్రామాల ఎల్సీడీ రకం మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 2 కార్లు, బైకులు సీజ్ చేశారు.