శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2020 (14:39 IST)

నీకు స్వర్గం చూపిస్తా అంటూ అక్కడ చేతులు పెట్టిన ఉపాధ్యాయుడు, షాకైన విద్యార్థిని

కరోనా కష్టకాలంలోనే చదువులు మాత్రం కొనసాగిస్తున్నారు. ఆన్ లైన్లోనే ప్రస్తుతం చదువుకుంటున్నారు విద్యార్థులు. అయితే ఆన్లైన్లో డౌట్‌లు క్లారిఫై కాకపోతుండటంతో కొంతమంది విద్యార్థునులు నేరుగా ఉపాధ్యాయుల వద్దకు వెళుతున్నారు. వారిలో కొందరు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
 
హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఒక విద్యార్థిని ఆన్లైన్లో పాఠాలు నేర్చుకుంటోంది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఉపాధ్యాయుడు మిశ్రా క్లాసులను బోధిస్తుంటాడు. విద్యార్థిని అందంగా ఉంటుంది. అంతే.. ఉపాధ్యాయుడి కన్ను పడింది.
 
క్లాస్‌లు పూర్తయిన తరువాత ఒక్కోసారి విద్యార్థినికి డౌట్లు వస్తూ ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయుడు దీన్నే ఆసరాగా చేసుకున్నాడు. డౌట్లను తీర్చే పేరుతో ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. సర్.. డౌట్ అని చెప్పగానే నేను ఇంటికి వస్తాను. నాకు పర్సనల్‌గా ఫోన్ చేయి అన్నాడు.
 
అడ్రెస్ కనుక్కుని ఇంటికి వెళ్ళాడు. డౌట్ ను తీరుస్తా.. చదువు కాదు నీకు స్వర్గం చూపిస్తా.. మళ్ళీ మళ్ళీ నా దగ్గరకి వస్తావు అంటూ మర్మాంగాల దగ్గర చేతులు పెట్టాడు కీచక ఉపాధ్యాయుడు. దీంతో ఆ విద్యార్థి షాకైంది. గట్టిగా కేకలు పెట్టి బయటకు పరుగులు తీసింది.
 
ఇంతలో ఉపాధ్యాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తరువాత విషయం చెప్పింది. దీంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.