1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పని ఉందంటూ తీసుకెళ్లి హత్యాచారం - ఇద్దరు వ్యక్తుల దుర్మార్గం

victim
తెలంగాణా రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ(40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.