1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:20 IST)

ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనిస్తే.. ఛాట్ చేస్తూ..?

ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనివ్వడమే పాపమైంది. తన చావుకు కారణమైంది. సెల్ ఫోన్‌లో తరుచూ చాటింగ్ చేస్తుందని సొంత అన్న కూతురునే చంపాడు ఓ కిరాతకుడు. ఈ దారుణమైన ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంటుంది. 
 
మియాపూర్ హనీఫ్ కాలనీలో నివాసం ఉంటున్న నందిని కీసర గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెల్ ఫోన్ లో తరుచూ చాటింగ్ చేస్తుందని గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. వరసకు మామ వరసయ్యే వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో తండ్రి సిమ్ కార్డ్ మార్చాడు. 
 
ఇటీవల తండ్రి పనికి వెళ్లిపోయాక, చాటింగ్ విషయంపై సొంత బాబాయ్‌తో బాలిక గొడవ పడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాబాయ్, కూతురు అని చూడకుండా కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది.