1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (12:41 IST)

మళ్లీ లవ్వులో పడిన శింబు... ఆమె ఎవరంటే?

simbu_nidhi
శింబు, మన్మథుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటుడు శింబు. తాజాగా అతడు హీరోగా నటించిన సినిమా ''మానాడు''. టైమ్ లూప్ బేస్‌డ్ థ్రిల్లర్‌గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపోతోంది.ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు.
 
ఈ నేపథ్యంలో స్టార్ హీరో శింబు అప్పట్లో నయనతార , హన్సికలతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరి తో తన బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈయన సినిమాల పైన ఫోకస్ చేశారు అయితే తాజాగా మరోసారి ప్రేమలో పడ్డారని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
మరోసారి అతడు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. నిధి అగర్వాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈశ్వరన్ సినిమాలో శింబు, నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 
 
అంతేకాదు గత రెండు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేసుకుంటున్నట్లు కోలీవుడ్ లో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.