సంబంధిత వార్తలు
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రేణూ దేశాయ్ (video)
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన జార్జి రెడ్డి మూవీ డైరెక్టర్ జీవన్ రెడ్డి
- అల్లు శిరీష్ బర్త్ డే వేడుకలు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ కట్
- అల్లు శిరీష్కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరో అల్లు శిరీష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్లో మొక్కలు నాటారు హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ... ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడున్న జీవినవిధానంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా విశ్వక్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నా మేనల్లుడు ఆర్నావ్, మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నాను.
రానున్న కొత్త తరానికి చెట్లను, ఏవిధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం చాలా అవసరమని అన్నారు. అందుకే తన మేనల్లుడు, మేనకోడళ్లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది.
