సంబంధిత వార్తలు
- బోయపాటి శ్రీను గురించి నందమూరి బాలకృష్ణ షాకింక్ కామెంట్!
- నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని దేవుడి పటాలు బోర్లించి టెక్కీ కుటుంబం సూసైడ్
- ధనుష్ నిర్ణయంపై కస్తూరి రాజా స్పందన కరెక్టే సినీప్రముఖుల వెల్లడి
- వరుణ్ తేజ్తో పెండ్లి గురించి లావణ్య ఏమందో తెలుసా!
- 50 రోజులు అఖండ విజయానికి ప్రేక్షకులే కారణం - బాలకృష్ణ
ఈ విజయంఎన్.టి.ఆర్ గారికి అంకితం
Akhanda 50 Days Celebration
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా... ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ, యాభై రోజులు అడుతుందనీ, ఇంకా థియేటర్లలో కొనసాగుతుందనీ కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం వుండాలంటూ జై బాలయ్య అంటూ ముగించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం
