1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (18:50 IST)

ముహూర్త టైమ్‌కు వరుడు పరార్ : 21 యేళ్ళ వధువును పెళ్లాడిన 65 యేళ్ళ మామ

బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు.

బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలోని సమష్టిపూర్‌కు చెందిన రోషన్ లాల్ (65) అనే వ్యక్తి కుమారుడుకి అదే ప్రాంతానికి చెందిన స్వప్న (21) అనే యువతినిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
 
వీరిద్దరి పెళ్లి ఆదివారం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లూ కూడా చేశారు. పెళ్లి మండపానికి బంధువులతో పాటు వధూవరులు కూడా వచ్చారు. 
 
అయితే, ముహూర్త సమయానికి వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోతే తమ పరువు పోతుందని భావించిన వధువు తండ్రి.. తన కుమార్తెను వివాహం చేసుకోవాలని వరుడు తండ్రిని ప్రాధేయపడ్డాడు. 
 
దీంతో 65 యేళ్ల రోషన్ లాల్ వధువు జీవితం పాటు వియ్యంకుడు కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు 21 యేళ్ళ వధువును పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.