సంబంధిత వార్తలు
- మళ్ళీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం.. సుప్రీంలో పిటిషన్
- రాజ్యాంగ ధర్మాసన తీర్పును తుంగలో తొక్కిన కర్ణాటక గవర్నర్
- గవర్నర్ కోర్టులో కర్ణాటక బంతి.. ఛాన్సివ్వకుంటే న్యాయపోరాటం
- ముంబై మారణహోమం.. ఉగ్రవాదుల్ని పురమాయించింది.. పాకిస్థానే: నవాజ్ షరీఫ్
- ''శ్రీదేవి'' మరణంపై దర్యాప్తు పిటిషన్ను కొట్టేసిన సుప్రీం కోర్టు-బీమా పాలసీలపై?
కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ : శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సర్కారు చిక్కుల్లో పడనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించ
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సర్కారు చిక్కుల్లో పడనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. పైగా, బలపరీక్షకు అవసరమైన భద్రతను కల్పించాల్సిందిగా కర్ణాటక డీజీపీకి ఆదేశించింది.
అదేసమయంలో కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని బీజేపీ తరపు న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
