1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio announced Rs 49 data plan for IPL 2024

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్-రూ.49లతో రీఛార్జ్ ప్లాన్

jioservice
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో జియో రూ.49లతో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక రోజు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వర్క్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తం 25జీబీ డేటా లభిస్తుంది. 
 
బేస్ యాక్టివ్ ప్లాన్ ఉన్నట్లైతే దీనిని రీఛార్జ్ చేసుకునే సదుపాయం వుంటుంది. అన్ లిమిటెడ్ డేటా పేరుతో దీనిని లిస్ట్ చేశారు. వినియోగదారులు 25జీబీ డేటాను వాడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గించబడుతుంది. 
 
దేశవ్యాప్తంగా ఉన్న జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. ఇక ఎయిర్‌టెల్ ఒకరోజు వాలిడిటీతో రూ.49 డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 20GB డేటా వస్తుంది. ఇది Jio ప్లాన్‌తో పోల్చినప్పుడు 5GB తక్కువ.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల గృహ నిర్బంధం... ఎందుకు?