సంబంధిత వార్తలు
- కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్: 4నెలలలో మూడు కోట్ల వ్యాక్సిన్లు
- తెలంగాణా రాష్ట్రంలో లాక్డౌన్ : క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
- తెలంగాణలో కురుస్తున్న వర్షాలు: మంచిర్యాలలో వడగళ్ల వాన
- అన్నదాతకు కేంద్రం వెన్నుపోటు: ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగ లేఖ
- సినీ పరిశ్రమ మరింత పుంజుకోవాలని టికెట్ రేట్స్ పెంచాం: తెలంగాణ మంత్రి తలసాని
TSలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు?
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలున్నాయి. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో సెలవులను కూడా 20వ తేదీ వరకు పొడిగిస్తారని తెలుస్తోంది. అయితే సెలవులు పొడిగింపుపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
