1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. ktr tests negative for corona and will attend assembly from today

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. నేటి నుంచి అసెంబ్లీకి...

ktrktr
కరోనా వైరస్ బారినపడిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని తెరాస పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన మంత్రి కేటీఆర్‌కు సోమవారం వైద్యులు పరీక్షలు చేయగా, కోవిడ్ నెగెటివ్‌గా ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ఫలితంలో కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతారని తెరాస ప్రకటించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలన్న పిటిషన్‌ను తోసేసిన సుప్రీం