సంబంధిత వార్తలు
- కరోనా నెగటివ్ రిపోర్ట్ వుంటేనే తిరుమలకు రండి..
- మహానటి అభిమానులకు గుడ్ న్యూస్: నెగెటివ్ అనేది పాజిటివ్గా మారింది
- ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి భారతీయడు
- ఊపిరి పీల్చుకున్న తెలంగాణ అధికారులు... ఆ 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్
- కరోనా నెగటివ్ సర్టిఫికెట్తో వస్తున్నారు, విమానం దిగగానే ఒమిక్రాన్ పాజిటివ్, నిషేధం తప్పదా?
కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. నేటి నుంచి అసెంబ్లీకి...
కరోనా వైరస్ బారినపడిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని తెరాస పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన మంత్రి కేటీఆర్కు సోమవారం వైద్యులు పరీక్షలు చేయగా, కోవిడ్ నెగెటివ్గా ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ఫలితంలో కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ధృవీకరించారు.
దీంతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రారంభమయ్యే సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతారని తెరాస ప్రకటించింది.