టాలీవుడ్ సీనియర్ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మోహన్ బాబు ఎట్టకేలకు మంగళవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లోని ఆ పార్టీ అధినేత జగన్తో సమావేశమైన తర్వాత ఆ పార్టీలో చేరారు. మోహన్బాబుకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసిందంటూ ఇటీవల ఆందోళన చేసిన మోహన్బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది....