శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (13:12 IST)

ఏపీలో పెరిగిన కరోనా ... 365కు పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం 9 గంటల వరకు రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదైన 2 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కి పెరిగిందని తెలిపింది. 
 
కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కొత్త కేసులను పరిశీలిస్తే మొత్తం 892 కొవిడ్-19 పరీక్షల్లో 17 కేసులు పాజిటివ్‌గా తేలాయి. నమోదైన మొత్తం 365 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మరణించారు.
 
ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 349గా ఉంది. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 51, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 38, కృష్ణా జిల్లాలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.