గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:24 IST)

సోదరుడితో అక్రమ సంబంధం.. అనంతలో కలకలం.. ప్రాణాల మీదకు?

సోదరుడితో అక్రమ సంబంధం వ్యవహారం అనంతపురంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. అనంత శివారులోని ఆదర్శనగర్‌లో రామాంజనేయులు, యాస్మిన్‌ దంపతులు ఉన్నారు. రామాంజనేయులకి దగ్గరి బంధువు శ్రీనివాసులు కూడా తన భా

సోదరుడితో అక్రమ సంబంధం వ్యవహారం అనంతపురంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. అనంత శివారులోని ఆదర్శనగర్‌లో రామాంజనేయులు, యాస్మిన్‌ దంపతులు ఉన్నారు. రామాంజనేయులకి దగ్గరి బంధువు శ్రీనివాసులు కూడా తన భార్య బిడ్డలతో అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. శ్రీనివాసులు యాస్మిన్‌కి తమ్ముడి వరస అవుతాడు. 
 
కానీ ఈ విషయాన్ని మరిచి శ్రీనివాసులు యాస్మిన్‌తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియరావడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో వీరిద్దరూ గత కొంత కాలంగా దూరంగా వుంటున్నారు. శ్రీనివాసులు గురువారం యాస్మిన్‌కు ఫోన్‌చేసి మాట్లాడాలని పిలవడంతో ఆమె అ తడి దగ్గరకు వచ్చింది. 
 
అక్కడి నుంచి అనంతపురం రూరల్‌ మండలం కాట్నేకాలువ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనతో సంబంధం కొనసాగించాలంటూ కోరడంతో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాసులు వెంటతెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె గొంతుపై కోసి, తలపై రాయితో మోదాడు. అతని నుంచి తప్పించుకుని ఆమె రోడ్డుపైకివచ్చి భర్తకు ఫోన్‌ద్వారా సమాచారం అందించి పరారై రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కానీ శ్రీనివాసులు కూడా తనకుతానే బ్లేడ్‌తో మణికట్టును కోసుకుని, విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులు, యాస్మిన్‌ను వేర్వేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.