1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anantha Padmanabha vratham in Thirumala tomorrow

రేపు తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Anantha Padmanabha vratham
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఉద‌యం అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి నిర్వహించనుంది.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు శ్రీ‌వారి ఆల‌య ప్రాగణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.
తర్వాతి కథనం
త్వరలో ఏపీ గ్రామాల్లో చెత్తకు ఛార్జీ!